పాకిస్థానులో బాంబు దాడి..ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-05T12:19:50+05:30 IST

పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి నగరంలో జరిగిన బాంబుదాడి ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, ఏడుగురు గాయపడ్డారు....

పాకిస్థానులో బాంబు దాడి..ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి నగరంలో జరిగిన బాంబుదాడి ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన రావల్పిండిలో మిలటరీ స్థావరం సమీపంలో బాంబు పేలుడు జరిగింది. టైమ్ డివైజ్ రావల్పిండి నగర బస్ టెర్మినల్ సమీపంలో పేలిందని రావల్పిండి నగర పోలీసు అధికార ప్రతినిధి సజ్జాద్ ఉల్ హసన్ చెప్పారు. ఈ బాంబు దాడిలో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ బాంబు దాడికి కారణాలు ఎవరనేది ఎవరూ ప్రకటించలేదు. బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై రావల్పిండి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2020-12-05T12:19:50+05:30 IST