రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-01-29T05:14:01+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
దౌల్తాబాద్, జనవరి 28: నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలం జాదరావుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య (24), అంజి (21) దామర్గిద్ద మండలం మొగుల్మడ్క గ్రామంలో బంధువులను కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం నాగసార్ గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కృష్ణయ్య అక్కడిక్కడే మృతిచెందగా అంజి పరిస్థితి విషమంగా ఉండటంతో కొడంగల్, తాండూర్ ప్రభుత్వాసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దౌల్తాబాద్ ఎస్సై రమేశ్ తెలిపారు.