రైలు ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-01-17T05:24:15+05:30 IST
రైలు ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన మరుపల్లి గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది.
గజపతినగరం, జనవరి 16: రైలు ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన మరుపల్లి గ్రామం వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మరుపల్లి గ్రామానికి చెందిన పొరిపిరెడ్డి దేముడు (35) పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా, బొబ్బిలి నుంచి విశాఖ వైపు వెళుతు న్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేముడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యవేణి, కుమారుడు హర్షవర్దన్, కుమార్తె యోగిత కలరు. మృతుడు రాజమండ్రి వద్ద మదనపల్లిలో క్వారీలో డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండగకు కుటుంబ సభ్యులతో స్వగ్రామం మరుపల్లి వచ్చారు. దేముడు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందిన సమాచారం మేరకు బొబ్బిలి రైల్వే పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామ కోసం మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.