అప్ఘనిస్థాన్‌లో కారు బాంబు పేలుడు..ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-01-15T17:43:18+05:30 IST

అప్ఘనిస్థాన్‌ దేశంలోని ఘజ్నీ ప్రావిన్సులో శుక్రవారం ఉదయం జరిగిన కారు బాంబు పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు....

అప్ఘనిస్థాన్‌లో కారు బాంబు పేలుడు..ఒకరి మృతి

ఏడుగురికి గాయాలు

ఘజ్నీ (అప్ఘనిస్థాన్‌): అప్ఘనిస్థాన్‌ దేశంలోని ఘజ్నీ ప్రావిన్సులో శుక్రవారం ఉదయం జరిగిన కారు బాంబు పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్-కందహార్ జాతీయ రహదారిపై జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఘజ్నీ గవర్నరు అధికార ప్రతినిధి తెలిపారు. గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని నెలలుగా అప్ఘనిస్థాన్‌ దేశంలో పలు పేలుడు ఘటనలు జరిగాయి. అప్ఘనిస్థాన్‌ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని తాలిబాన్లు తరచూ దాడులకు పాల్పడుతున్నారు.ఈ పేలుడుకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తేలలేదు. 

Updated Date - 2021-01-15T17:43:18+05:30 IST