పర్వతారోహకుడికి రూ. లక్ష చెక్కు అందజేత
ABN , First Publish Date - 2021-10-24T05:30:00+05:30 IST
వి.కోట మండలం పాపేపల్లెకు చెందిన పర్వాతారోహకుడు ధనుంజయగౌడుకు అమ్మక్ట్సు సంస్థ సీఈవో దశరథరెడ్డి రూ. లక్ష చెక్కును అందించారు.
వి.కోట, అక్టోబరు 24: వి.కోట మండలం పాపేపల్లెకు చెందిన పర్వాతారోహకుడు ధనుంజయగౌడుకు అమ్మక్ట్సు సంస్థ సీఈవో దశరథరెడ్డి రూ. లక్ష చెక్కును అందించారు. ఆదివారం జరిగిన అమ్మాక్ట్సు సమావేశానికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు హాజరుకాగా ఆయన చేతుల మీదుగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చెక్కును బహుకరించారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో దశరథరెడ్డి, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.