రామమందిర నిర్మాణానికి రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2021-01-18T05:12:28+05:30 IST
రామమందిర నిర్మాణానికి రూ.లక్ష విరాళం
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, జనవరి 17 : అయోధ్య రామమందిర నిర్మాణానికి మహబూబాబాద్కు చెందిన బవిరిశెట్టి వెంకటయ్య రూ.1,00,116 విరాళాన్ని అందజేశా రు. రామమందిర నిర్మాణంలో అందరిని భాగస్వాములను చేయాలన్న పిలుపులో భాగంగా పట్టణానికి చెందిన శతాధిక వృద్ధుడు వెంకటయ్య రూ.లక్ష చెక్కును జిల్లా సం యోజక్ పింగిలి శ్రీనివాస్కు ఆదివారం అందజేశారు. అనంతరం వెంకటయ్యను వారు సత్కరించారు. బవిరిశెట్టి శ్రీనివాస్, బవిరిశెట్టి రాజేశ్వర్రావు, యాప సీతయ్య, మొసంగి మురళి, ముల్లంగి ప్రతాప్రెడ్డి, క్యాచువల్ శ్యాం సుందర్శర్మ, బోనగిరి గంగాధర్, సోమ రజినికుమార్, నేతాజీ, కిశోర్కుమార్, విజయ్కుమార్, సోమయ్య, చంద్ర శేఖర్, రాజుగౌడ్, ఆలకుంట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.