డిటోనేటర్‌ పేలడంతో వ్యక్తికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-05-17T05:42:24+05:30 IST

పట్టణంలోని అవుకు రహదారిలో బండల ప్యాక్టరీ వద్ద డిటోనేటర్‌ పేలి షేక్‌ హబూబ్‌వలి అను వ్యకికి గాయాలైనట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు.

డిటోనేటర్‌ పేలడంతో వ్యక్తికి తీవ్రగాయాలు

బనగానపల్ల్లె, మే 16: పట్టణంలోని అవుకు రహదారిలో బండల ప్యాక్టరీ వద్ద డిటోనేటర్‌ పేలి షేక్‌ హబూబ్‌వలి  అను వ్యకికి గాయాలైనట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు.  బాలనరసింహారెడ్డి బండల ప్యాక్టరీలో పనిచేసే మహబూబ్‌ వలి ప్యాక్టరీ సమీపంలోని చెత్తా చెదారం  కాల్చివేస్తుండగా ఒక్కసారి డిటోనేటర్‌ పేలడంతో మహబూబ్‌ వలికి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను  బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా వివరాలు తెలుసుకున్నారు. డిటోనేటర్‌ ఎక్కడినుంచి తెచ్చారో పేలుడుకు కారణాలు ఆరా తీస్తున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-05-17T05:42:24+05:30 IST