డబ్బు నేల మీద పడేసి, తల్లి దృష్టి మళ్లించి శిశువు కిడ్నాప్

ABN , First Publish Date - 2021-06-12T12:39:10+05:30 IST

తల్లి దృష్టి మళ్లించి నెలరోజుల వయసున్న శిశువును కిడ్నాప్ చేసిన ఘటన...

డబ్బు నేల మీద పడేసి, తల్లి దృష్టి మళ్లించి శిశువు కిడ్నాప్

పనాజీ (గోవా): తల్లి దృష్టి మళ్లించి నెలరోజుల వయసున్న శిశువును కిడ్నాప్ చేసిన ఘటన గోవా రాష్ట్రంలో జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి గోవా వైద్యకళాశాల ఆసుపత్రికి వచ్చి కరెన్సీనోట్లను కింద పడేసి తల్లి దృష్టి మళ్లించి నెలరోజుల వయసున్న శిశువును కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు. దీంతో గోవా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. శిశువును కిడ్నాప్ చేసిన నిందితుడి కోసం తాము గాలిస్తున్నామని గోవా పోలీసులు చెప్పారు. ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ ఘటన భద్రతా లోపమని కాంగ్రెస్ నాయకుడు దిగంబర్ కామత్ విమర్శించారు.

Updated Date - 2021-06-12T12:39:10+05:30 IST