Teenmar Mallanna పై ఫిర్యాదు.. స్ట్రాంగ్ వార్నింగ్..

ABN , First Publish Date - 2021-08-25T12:01:25+05:30 IST

చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై

Teenmar Mallanna పై ఫిర్యాదు.. స్ట్రాంగ్ వార్నింగ్..

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా విభాగం కన్వీనర్‌ మన్నె క్రిషాంక్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సైబర్‌క్రైమ్స్‌ కార్యాలయానికి వచ్చిన క్రిషాంక్‌, జగన్‌ పటిమీది, వై.సతీ‌ష్‌రెడ్డి, దినేష్‌ చౌదరి ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.


నవీన్‌కుమార్‌ ఉద్దేశపూర్వకంగా సీఎం కేసీఆర్‌ను దూషించడమే కాకుండా, ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా కథనాలు ప్రసారం చేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే క్యూ-న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ వాడుకుంటున్నాడని అన్నారు. అతడి చర్యలు నేరపూరితంగా ఉన్నాయని, చట్టప్రకారం కేసులు నమోదుచేసి శిక్షించాలని ఏసీపీని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తీన్మార్‌ మల్లన్న తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని, అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగుతామని వారు హెచ్చరించారు.

Updated Date - 2021-08-25T12:01:25+05:30 IST