నిద్రిస్తున్న యువకుడి పైనుంచి వెళ్లిన బోరుబండి

ABN , First Publish Date - 2020-11-28T06:07:47+05:30 IST

మండలంలోని గన్నోర గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న వ్యక్తి మీదుగా బోరుబండి పోవడడంతో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

నిద్రిస్తున్న యువకుడి పైనుంచి వెళ్లిన బోరుబండి

అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు

ముథోల్‌, నవంబరు 27: మండలంలోని గన్నోర గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న వ్యక్తి మీదుగా బోరుబండి పోవడడంతో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఛత్తీ్‌సఘడ్‌ రాష్ట్రం, కోరుబోక జిల్లా, పోండియపోడా తాలుకా, చారుబొక గ్రామానికి చెందిన  మోహర్‌సాయి(18) అనే యువకుడు శ్రీజనని బోరువెల్‌ యాజమాని వద్ద బోరు బండిపై  పనిచేస్తున్నాడు. అయితే మండలంలోని గన్నోర గ్రామంలో ఓ రైతు తన చేనులో గురువారం రాత్రి బోరుబావి తవ్వించారు. కాగా, వేసిన బోరుబావి లో నీళ్లు పడకపోవడంతో చేనులోనే మరొక్కచేట బోరుబావి తవ్వించేందుకు నిర్ణహించుకున్నాడు. అయితే, ఆగిన బోరుబండి కింద మృతుడు నిద్ర పోయాడు. ఈ విషయాన్ని గమనించని బోరుబండి డ్రైవర్‌ బండిని వెనుకకు తీయగా సంబంధిత బోరు వాహనం నిద్రిస్తున్న మోహర్‌సాయి మీదనుంచి వెళ్లింది, దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ముథోల్‌ ఎస్సై అశోక్‌ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2020-11-28T06:07:47+05:30 IST