గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-01-22T04:43:57+05:30 IST
నాయుడుపేట-శ్రీకాళహస్తి బైపాస్రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఏఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.
నాయుడుపేట టౌన్, జనవరి 21 : నాయుడుపేట-శ్రీకాళహస్తి బైపాస్రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఏఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. ఆ వ్యక్తి ఐదేళ్లుగా నాయుడుపేట పట్టణ సమీపంలో చిత్తుకాగితాలు వేరుకుంటూ దుకాణాల వద్ద ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అతను బైపాస్రోడ్డు సమీపంలో మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి 45 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.