గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-01-22T04:43:57+05:30 IST

నాయుడుపేట-శ్రీకాళహస్తి బైపాస్‌రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఏఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒకరి మృతి
మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి

నాయుడుపేట టౌన్‌, జనవరి 21 : నాయుడుపేట-శ్రీకాళహస్తి బైపాస్‌రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఏఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. ఆ వ్యక్తి ఐదేళ్లుగా నాయుడుపేట పట్టణ సమీపంలో చిత్తుకాగితాలు వేరుకుంటూ దుకాణాల వద్ద ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో  గురువారం రాత్రి అతను బైపాస్‌రోడ్డు సమీపంలో మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి 45 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-22T04:43:57+05:30 IST