బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-03-03T05:47:55+05:30 IST
మండలంలోని చిక్కాల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ మంగళవారం తెలిపారు.
చాగల్లు, మార్చి 2: మండలంలోని చిక్కాల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ మంగళవారం తెలిపారు. చిక్కాలకు చెందిన కొయ్యే శ్రీరాములు (53) గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెం బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా చిక్కాల శివారులో బైక్ అదుపు తప్పి పడిపోయాడని, తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడని తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.