నరసరావుపేటలో ఒకరి మృతి.. కరోనా లక్షణాలతో అని ప్రచారం

ABN , First Publish Date - 2020-04-09T17:17:01+05:30 IST

గుంటూరు ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనా లక్షణా లతో ఆ వ్యక్తి మృతి చెందినట్లు పట్టణంలో

నరసరావుపేటలో ఒకరి మృతి.. కరోనా లక్షణాలతో అని ప్రచారం

కుటుంబ సభ్యులను పరీక్షలకు తరలించిన అధికారులు

నరసరావుపేట (ఆంధ్రజ్యోతి): గుంటూరు ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి  మృతి చెందాడు. కరోనా లక్షణా లతో ఆ వ్యక్తి మృతి చెందినట్లు పట్టణంలో ప్రచారం జరిగింది. అయితే అతడు నెమ్ముతో గుంటూరు జనరల్‌ ఆస్పత్రికి రాగా ఫీవర్‌ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు చెబుతున్నారు.  ఈ క్రమంలో అతడి మృతితో అధికారులు అప్రమత్త మయ్యారు. సదరు వ్యక్తి కుటుంబీకులను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కరోనా లక్షణాలతో సదరు వ్యక్తి మృతి చెందాడా అనే అంశంపై ఆర్డీవో పోలీసు అధికారులను వివరణ కోరగా వైద్య పరీక్షల నివేదికలు రాలేదన్నారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఆ వ్యక్తి నివాస ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేశామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-09T17:17:01+05:30 IST