గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-03-02T05:54:36+05:30 IST
టీ.నర్సాపురం మండలం తిరుమలదేవి పేట గ్రామానికి చెందిన రాజ్కుమార్ (25) మండలంలోని యర్నగూడెంలో నివాసం ఉంటున్నారు.
దేవరపల్లి, మార్చి 1: టీ.నర్సాపురం మండలం తిరుమలదేవి పేట గ్రామానికి చెందిన రాజ్కుమార్ (25) మండలంలోని యర్నగూడెంలో నివాసం ఉంటున్నారు. దేవరపల్లి చికెన్షాపులో పనిచేస్తున్న ఇతను మధ్యాహ్నం భోజనానికి యర్న గూడెం మోటార్సైకిల్పై వెళ్తుండగా మార్గమధ్యంలో రామన్నపాలెం చర్చి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ఐ స్వామి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ఉపాధి కోసం వలస వచ్చాడన్నారు.. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.