పేలుడు ఘటనలో గాయపడిన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:56:20+05:30 IST

మర్కు బస్తీలోని ఓ ఇంట్లో రెండురోజుల క్రితం పేలుడు సంభవించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవుని దుర్గయ్య(60) చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ప్రాణాలొదిలాడు.

పేలుడు ఘటనలో గాయపడిన వ్యక్తి మృతి

రామాయంపేట, జనవరి 15: మర్కు బస్తీలోని ఓ ఇంట్లో రెండురోజుల క్రితం పేలుడు సంభవించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవుని దుర్గయ్య(60) చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ప్రాణాలొదిలాడు. ఇంట్లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచగా.. కిరోసిన్‌ స్టౌవ్‌ పేలడంతో దుర్గయ్య మంటల్లో చిక్కుకున్నాడు. 90శాతం శరీరం కాలిపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. కాగా ఆయన కొంతకాలంగా అద్దెకు నివసిస్తున్న ఇంట్లో సారా తయారీకి వాడే ఇప్పపువ్వుతో పాటు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2021-01-16T05:56:20+05:30 IST