పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-19T04:15:19+05:30 IST
కుటుంబకలహాలతో మానసికస్థితి కోల్పోయిన ఓ వ్యక్తి పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తడ, అక్టోబరు 18 : కుటుంబకలహాలతో మానసికస్థితి కోల్పోయిన ఓ వ్యక్తి పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి వివరాల మేరకు మండలంలోని రామాపురం పంచాయతీ ఎస్ఆర్కండ్రిగ గ్రామానికి చెందిన గుమ్మిడిపూడి తంగరాజు (30) కొన్నేళ్ల క్రితం డ్రైవర్గా పనిచేస్తూ ప్రమాదం బారినపడ్డాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత మానసిక ఆందోళనకు గురై ఆదివారం గ్రామ సరిహద్దుల్లోని శ్మశానం వద్ద పురుగులమందు తాగాడు. గ్రామస్థులు గమనించి వెంటనే చెన్నై ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు.