ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడిన పాప.. ఎవరూ చూడకపోవడంతో..!

ABN , First Publish Date - 2020-08-03T16:51:07+05:30 IST

నీటి తొట్టిలోపడి చిన్నారి మేరి(1) మృతిచెందిన సంఘటన ఆదివారం మండలకేంద్రంలోని దేశ్యా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధారవత్‌ వెంకన్న, చిన్ని దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా

ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడిన పాప.. ఎవరూ చూడకపోవడంతో..!

నీటితొట్టిలో పడి చిన్నారి మృతి


మరిపెడ(ఆంధ్రజ్యోతి) : నీటి తొట్టిలోపడి చిన్నారి మేరి(1) మృతిచెందిన సంఘటన ఆదివారం మండలకేంద్రంలోని దేశ్యా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధారవత్‌ వెంకన్న, చిన్ని దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా ఆదివారం వెంకన్న పనుల కోసం మరిపెడకు వెళ్లగా, ఆయన భార్య చిన్ని భోజనం చేస్తున్న సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న నీటి తొట్టి వద్ద చిన్న కూతురు మేరి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయింది. ఎవరూ చూడకపోవడంతో చనిపోయింది. చిన్నారి కోసం వెతికిన తల్లికి మేరి విగతజీవిగా కనిపించింది.   చిన్నారి మృతితో వెంకన్న దంపతులు బోరున విలపించారు.

Updated Date - 2020-08-03T16:51:07+05:30 IST