రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-06-14T05:53:42+05:30 IST
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన వేటపాలెం-చీరాల మధ్య చల్లారెడ్డి పాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరి గింది. ఈ ఘటనలో చీరాల మండలం వాడరేవుకు చెంది న సున్నపు వెంకటేష్ (30) అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతి చెందిన వెంకటేష్
చీరాల, జూన్ 13 : రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన వేటపాలెం-చీరాల మధ్య చల్లారెడ్డి పాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరి గింది. ఈ ఘటనలో చీరాల మండలం వాడరేవుకు చెంది న సున్నపు వెంకటేష్ (30) అక్కడికక్కడే మృతిచెందాడు. వేటపాలెం ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాడరేవుకు చెందిన సున్నపు పోలయ్య కుమారుడు వెం కటేష్ ఆదివారం వాడరేవు నుంచి వేటపాలెం మండలం కఠారివారిపాలెం వెళుతున్నాడు. వేటపాలెం వైపు నుంచి చీరాల వైపు వస్తున్న లారీ చల్లారెడ్డిపాలెం సమీపంలో ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న వెంకటేష్ బైక్ను ఢీకొంది. దీంతో వెంకటే ష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెం దాడు. సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏ రియా వైద్యశాలకు తరలించారు.