మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
ABN , First Publish Date - 2020-10-29T10:33:31+05:30 IST
ఏళ్ల తరబడి మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబాల పోషణ కష్టతరంగా మారిన మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ నాయకులు పీసీ కేశవరావు డిమాండ్ చేశారు.
కనిగిరి, అక్టోబరు 28 : ఏళ్ల తరబడి మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబాల పోషణ కష్టతరంగా మారిన మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ నాయకులు పీసీ కేశవరావు డిమాండ్ చేశారు. ఆ మేరకు మున్సి పల్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా కార్యక్రమం నిర్వ హించారు. మున్సిపల్ కార్మికులకు రూ.23 వేల జీతం ఇచ్చి, రెగ్యులర్ చేయాలని కేశవరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలస్వామి, శేషయ్య, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.