రైతుల సంక్షేమానికే పథకాలు : ఎమ్మెల్యే బుర్రా
ABN , First Publish Date - 2020-10-29T10:35:08+05:30 IST
రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం అనేక పథ కాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ అన్నారు.
రైతుల సంక్షేమానికే పథకాలు : ఎమ్మెల్యే బుర్రా
పామూరు, అక్టోబరు 28 : రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం అనేక పథ కాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ అన్నారు. మం డలంలోని మోపాడు గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించి పాడి రైతులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఎలాంటి ఇన్స్యూరెన్స్ లేకపోయినా ప్రమాదంలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ కందుకూరు డీడీ చంద్రశేఖర్, ఒంగోలు డీడీ, ఎస్ఎల్బీసీ షేక్ కాలేషా, కందుకూరు, సీఎస్పురం ఏడీలు ఆర్ రమేష్, కోటేశ్వరరావు, పశువైద్యాధికారులు ఈమణి శ్రీసాయి, షేక్ మునీర్బాషా, హనుమాన్ సాహెబ్, ఏవో అబ్రహంలింకన్, వెటర్నరీ అసిస్టెంట్ షేక్ ఖాదర్బాషా, వైసీపీ నాయకులు గంగసాని హుస్సేన్రెడ్డి, సుబ్బయ్య, రాంబాబు, డాక్టర్ కోటపాటి శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, ఏహెచ్లు పాల్గొన్నారు.