కళాక్షేత్రం అన్యాక్రాంతం కాకుండా చూడాలి
ABN , First Publish Date - 2020-10-30T11:19:08+05:30 IST
మా ర్కాపురం నడిబొడ్డున ఉన్న ఎస్సీవీకే కళాక్షేత్రం ఆస్తులు అన్యాక్రాం తం కాకుండా చూడాలని మార్కాపు రం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుం దు రు నాగార్జునరెడ్డి, అన్నా వెంకట రాంబాబు అన్నారు.
ఎమ్మెల్యేలు కుందురు, అన్నా
మార్కాపురం, అక్టోబరు 29: మా ర్కాపురం నడిబొడ్డున ఉన్న ఎస్సీవీకే కళాక్షేత్రం ఆస్తులు అన్యాక్రాం తం కాకుండా చూడాలని మార్కాపు రం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుం దు రు నాగార్జునరెడ్డి, అన్నా వెంకట రాంబాబు అన్నారు. స్థానిక ఎస్సీవీకే కళాక్షేత్రంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని గు రువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రక నేపఽథ్యమున్న కళాక్షేత్రం ఔన్నత్యాన్ని సభ్యులు కాపాడాలన్నా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, కమిటీ అధ్యక్షుడు గుం టక సుబ్బారెడ్డి, ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాఽథ్, టీ డీపీ రాష్ట్ర పరిశీలకుడు శాసనాల వీరబ్రహ్మం, వైసీపీ నాయకులు డీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.