కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ
ABN , First Publish Date - 2021-11-29T22:02:02+05:30 IST
సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఒమైక్రాన్ వేరియంట్పై కేబినెట్కు వైద్యాధికారులు వివరణ ఇచ్చారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఒమైక్రాన్ వేరియంట్పై కేబినెట్కు వైద్యాధికారులు వివరణ ఇచ్చారు. వివిధ దేశాల్లో ఒమైక్రాన్ పరిస్థితిపై అధికారులు నివేదిక సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఆదిలాబాద్, కొమ్రంభీం, నిర్మల్, మహబూబ్నగర్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి సీఎం ఆదేశించారు. ఉప్పుడు బియ్యంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల ఢిల్లీ పర్యటన, కేంద్ర ప్రభుత్వ స్పందన, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్ల పురోగతి, వచ్చే యాసంగి సీజన్ కార్యాచరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రోత్సాహకాలు, రైతుబంధు నిధుల పంపిణీ తదితర అంశాలు మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.