కొనసాగుతున్న కూల్చివేతలు
ABN , First Publish Date - 2022-01-20T04:29:29+05:30 IST
కొనసాగుతున్న కూల్చివేతలు
శామీర్పేట : మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు నజర్ పెట్టారు. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను అధికారులు బందోబస్తు మధ్య బుధవారం కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కూల్చివేతలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. కాగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేయడం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ యశ్వంత్రావ్, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ ధీరజ్, స్వరూపా, జేపీవో సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, మేఘన తదితరులు పాల్గొన్నారు.