కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-22T07:23:52+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి బుధవారం కూడా కొనసాగింది. 10 గేట్లు ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి బుధవారం కూడా కొనసాగింది. 10 గేట్లు ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి 3లక్షల 58,470 క్యూసెక్కులు, పవర్‌హౌస్‌ నుంచి 16,732, సుంకేసుల ద్వారా 50,904, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులతో కలుపుకొని 4 లక్షల 26,223 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మొత్తం 4లక్షల 19,875 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


జూరాల ప్రాజెక్టుకు 3.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా 35 గేట్లు తెరిచి 3.58 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 18 క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి 3,42,986 క్యూసెక్కుల నీటిని సాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2020-10-22T07:23:52+05:30 IST