ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,139 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు డీఈ నరేష్‌ తెలిపారు.

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం

ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న 5,139 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎగువన 89శాతం నిండిన విష్ణుపురి ప్రాజెక్టు

ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం

గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీకి  రానున్న భారీ వరద 

మెండోర, జూన్‌ 21: శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,139 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు డీఈ నరేష్‌ తెలిపారు. అలాగే, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న విష్ణుపురి ప్రాజెక్టు 89శాతం నిండిందని, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీ నీరు చే రిందన్నారు. దీంతో విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఏ క్షణంలోనైనా ఎత్తే అవకా శం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుందని వి వరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 406 క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 50క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 152క్యూసెక్కులు ఔ ట్‌ప్లో వెళ్తోందని డీఈ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 (90టీఎంసీలు)అడుగులు కాగా.. సోమవారం సాయంత్రానికి 1,067.80 (24. 95 4టీఎంసీలు)అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. గత సంవత్సరం ఇ దేరోజు 1,070.40(29.722టీఎంసీలు)అడుగుల నీరు నిల్వ ఉందని, జూన్‌ 1వ తేదీ నుంచి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 7.672టీఎంసీల వరదనీరు వ చ్చి చేరిందని డీఈ తెలిపారు.

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST