శాలిపేటలో కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్
ABN , First Publish Date - 2021-06-20T05:57:48+05:30 IST
మండలంలోని శాలిపేటలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నది.
చిన్నశంకరంపేట, జూన్ 19: మండలంలోని శాలిపేటలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నది. గ్రామంలో శుక్రవారం భూతగాదాలతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం బాధితుల బంధువులు దాడిచేసినవారి ఇళ్లపై దాడిచేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎండీగౌస్ పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు. హత్య, యత్నానికి పాల్పడిన 9 మందిని రిమాండ్కు తరలించనున్నట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామంలోని సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు పోలీస్ బందోబస్తు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.