భారీ గణేషుడి దర్శనానికి కొనసాగుతున్న రద్దీ
ABN , First Publish Date - 2021-09-14T23:47:47+05:30 IST
ఖైరతాబాద్లోభారీ గణేషుడి దర్శనానికి కొనసాగుతున్న రద్దీ మహా గణపతి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా
హైదరాబాద్: ఖైరతాబాద్లో భారీ గణేషుడి దర్శనానికి కొనసాగుతున్న రద్దీ మహా గణపతి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. ఐదు రోజుల్లో ఖైరతాబాద్ గణేషుడిని ఆరు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాల్టితో లడ్డూ ప్రసాదం పంపిణీ పూర్తికానుంది. ఇప్పటి వరకు లక్షా 40 వేల మంది భక్తులకు ఖైరతాబాద్ గణేషుడి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. మూడు రోజులపాటు లడ్డూ ప్రసాదాన్ని నిర్వాహకులు పంపిణీ చేశారు.