ఐటీ ఉద్యోగి తనూజ మృతిపై కొనసాగుతున్న సస్పెన్స్

ABN , First Publish Date - 2022-01-21T00:12:11+05:30 IST

నగరంలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని

ఐటీ ఉద్యోగి తనూజ మృతిపై కొనసాగుతున్న సస్పెన్స్

విజయవాడ: నగరంలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని తనూజ మృతిపై సస్పెన్స్ కొనసాగుతోంది. విచారణ కోసం బెజవాడ పోలీసులు గుంటూరు వెళ్లారు. తనూజ గుంటూరు నుంచి విజయవాడ ఎలా వచ్చిందో నిర్ధారణ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఏటీ అగ్రహారం పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. తనూజ మృతదేహంపై బంగారం పోలేదని బంధువులు, పోలీసులు తెలిపారు. గుంటూరులో రోడ్డు ప్రమాదం జరిగితే వైద్యం కోసం బెజవాడ తీసుకొచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 
ఏం జరిగింది..

గుంటూరు జిల్లాలోని ఏటీ అగ్రహారానికి చెందిన తనూజకు 2018లో మణికంఠతో వివాహమైంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఐటీ ఉద్యోగులే.  వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. భార్యాభర్తలు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే కొవిడ్‌ కారణంగా కొంతకాలంగా ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్నారు.

తనూజ ఆదివారం ఇంటి నుంచి వెళ్లింది.. తిరిగి మళ్లీ రాలేదు. ఆమె కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు సోమవారం గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇంతలో విజయవాడలోని శిఖామణి సెంటర్‌ సమీపంలో రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేశారు. తనూజ కూడా మిస్సింగ్ కావడంతో గుంటూరు పోలీసులకు అనుమానం వచ్చింది.




Updated Date - 2022-01-21T00:12:11+05:30 IST