‘ఉల్లి’ దిగేనా..
ABN , First Publish Date - 2021-02-26T06:52:58+05:30 IST
ఉల్లిపాయల ధరలు ఈమధ్య విపరీతంగా పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
- తగ్గిన హోల్సేల్ ధర
- రూ.47 నుంచి 40కి దిగువకు
- రెండో రకం కిలో రూ.28
- మరింత తగ్గుతుందని అంచనా
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ఉల్లిపాయల ధరలు ఈమధ్య విపరీతంగా పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హోల్సేల్ ధరల ప్రకారం నాణ్యమైన రకం కేజీ రూ. 40 నుంచి 42 వరకూ ఉంది. రెండు రోజుల కిందట కిలో రూ.47 వరకూ ఉంది. దీంతో బయట మార్కెట్లో రూ.50 నుంచి 60 వరకూ అమ్మేశారు. అవి కూడా రెండో రకం పాయలే. మంచిరకం పాయలు జిల్లాలో కొద్ది ప్రాంతాలలోనే కనిపిస్తున్నాయి. ఇక తెల్ల ఉల్లిపాయలు కూడా వచ్చాయి. అవి కేజీ రూ.28 నుంచి 30 వరకూ ఉన్నాయి. జాయింట్ ఉల్లిపాయల ధర కేజీ రూ.32 వరకూ ఉంది. మీడియం రకం పాయలు రూ.38 నుంచి 40 వరకూ ఉన్నాయి. చిల్లర వ్యాపారులు మీడియం, రెండో రకం పా యలనే మనకు నాణ్యమైనవిగా అమ్మేస్తున్నారు.