ఉల్లి రూ.80
ABN , First Publish Date - 2020-10-20T09:03:46+05:30 IST
ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం నాటికి రైతుబజార్లలో కిలో రూ.57 ఉన్న ధర
రైతుబజార్లలో రూ.65
...అయినా దొరకని సరకు
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం నాటికి రైతుబజార్లలో కిలో రూ.57 ఉన్న ధర సోమవారం రూ.65కి చేరింది. హోల్సేల్ మార్కెట్లో ఉదయం రూ.65కు విక్రయించి పది గంటల తరువాత రూ.70కి పెంచేశారు. పైగా రెగ్యులర్గా అరువుపై ఉల్లిని తీసుకువెళ్లే డ్వాక్రా సంఘాలకు ‘నగదు ఇస్తేనే సరకు ఇస్తాము’ అంటూ నిబంధన పెట్టారు. దాంతో పలు రైతుబజార్లకు అనుకున్న స్థాయిలో ఉల్లి రాలేదు.
ఇక బహిరంగ మార్కెట్లో ఈ ధర రూ.80కి చేరింది. మహారాష్ట్ర నుంచి సోమవారం ఒక్క లారీయే జ్ఞానపురం మార్కెట్కు వచ్చింది. దాంతో డిమాండ్ అమాంతం పెరిగింది. చూస్తుండగానే కిలో రూ.100కు చేరిపోయే పరిస్థితి వచ్చింది. దీనిపై జిల్లా యంత్రాంగం ఇంతవరకు దృష్టి పెట్టలేదు. టోకున రాష్ట్ర ప్రభుత్వమే కొని తక్కువ ధరకు సరఫరా చేస్తే తప్ప సామాన్యులకు ఉల్లి అందని పరిస్థితి ఏర్పడింది.