12 నుంచి ఉల్లి విక్రయాలు

ABN , First Publish Date - 2020-08-11T11:55:55+05:30 IST

కర్నూలు మార్కెట్‌ యార్డులో ఈ నెల 12 నుంచి ఉల్లి విక్రయాలు చేపడుతున్నామని సెలక్షన్‌ గ్రేడ్‌

12 నుంచి ఉల్లి విక్రయాలు

  • వారానికి మూడు రోజులే 

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 10: కర్నూలు మార్కెట్‌ యార్డులో ఈ నెల 12 నుంచి ఉల్లి విక్రయాలు చేపడుతున్నామని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. సోమ, బుధ, శనివారాల్లో మాత్రమే వారానికి మూడు రోజులు రైతులు ఉల్లిని మార్కెట్‌యార్డుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు. మార్కెట్‌ యార్డుకు ఉల్లి వాహనాలను రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 లోపే తీసుకుని రావాలని కోరారు. రైతులు ఉల్లిని ట్రాక్టర్ల మీదే ఉంచుకోవాలని, వ్యాపారులు అక్కడికే వచ్చి బహిరంగ వేలం ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తారని తెలిపారు. 

Updated Date - 2020-08-11T11:55:55+05:30 IST