ఆన్‌లైన్‌ మోసం

ABN , First Publish Date - 2021-03-03T06:41:53+05:30 IST

ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో ఓ యువకుడిని మోసగాళ్లు బురిడి కొట్టించిన వైనం మంగళవారం నాగాయ లంకలో వెలుగు చూసింది.

ఆన్‌లైన్‌ మోసం
ఫోన్‌కు బదులు ప్యాకెట్‌లో వచ్చిన సోం పాపిడి

రూ.1700కే రూ.10 వేల విలువైన ఫోన్‌

నాగాయలంక, మార్చి 2 : ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో  ఓ యువకుడిని మోసగాళ్లు బురిడి కొట్టించిన వైనం మంగళవారం నాగాయ లంకలో వెలుగు చూసింది. మండలానికి చెందిన ఓ వ్యాపారికి ఆన్‌లైన్‌లో లాటరీ తగిలిందని, రూ.1700 చెల్లిస్తే రూ.10 వేల విలువ చేసే ఫోన్‌ను ఇస్తామని ఆన్‌లైన్‌ మోసగాళ్లు నమ్మబలకటంతో సదరు వ్యాపారి ఆ మొత్తాన్ని చెల్లించి పార్శిల్‌ తీసుకు న్నాడు. ఇంటి కొచ్చిని పార్శిల్‌ విప్పి చూస్తే సోమ్‌పాపిడి (పీచు మిఠాయి) ప్యాకెట్‌ కనిపించటంతో అవాక్కయ్యాడు.   తనకు ఫోన్‌ చేసిన ఆన్‌లైన్‌ మోసగాడిని సంప్రదిం చటా నికి ప్రయత్నించగా, స్పందించకపోవడంతో మోసపో యానని గ్రహించి లబోదిబోమంటున్నాడు. లాటరీ పేరుతో ఇదే విధంగా పలువురికి ఫోన్‌ కాల్స్‌ రావటం వారు డబ్బు చెల్లించి మోసపోవటం ఇటీవల కాలంలో పరిపాటిగా మారినప్పటికీ తక్కువ ధరకే వస్తుందన్న ఆశతో మోస పోయే వాళ్లు మోసపోతూనే ఉన్నారు.  వ్యాపారికి వచ్చిన సోమ్‌ పాపిడి ప్యాకెట్‌ కూడా పూర్తిగా పాడైపోయి కుళ్లు కంపు కొట్టే దశలో ఉంది. 



Updated Date - 2021-03-03T06:41:53+05:30 IST