‘ఆన్లైన్’ అర్థం కాక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విద్యార్థిని
ABN , First Publish Date - 2020-12-18T12:11:37+05:30 IST
ఆన్లైన్ క్లాసులు అర్థం కాక పోవడంతో పరీక్షలు
హైదరాబాద్/హయత్నగర్ : ఆన్లైన్ క్లాసులు అర్థం కాక పోవడంతో పరీక్షలు సరిగ్గా రాయలేనేమోనని పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తొర్రూరు గ్రామానికి చెంది మౌనిక (15) రోజూ ఆన్లైన్ క్లాసులు వింటోంది. క్లాసులు అర్థం కావడం లేదని బుధవారం తల్లికి చెప్పింది. రేపు పరీక్షలు ఉన్నాయనగా ఇప్పుడు ఇలా ఎలా చెబుతున్నావంటూ తల్లి మందలించింది. దీంతో మౌనిక లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు హయత్నగర్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు.