విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
ABN , First Publish Date - 2020-03-27T05:30:00+05:30 IST
కరోనావైరస్ వల్ల పిల్లలకు ఈసారి వేసవి సెలవులు చాలా ముందే వచ్చాయి. కొత్త విద్యాసంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో ..
కరోనావైరస్ వల్ల పిల్లలకు ఈసారి వేసవి సెలవులు చాలా ముందే వచ్చాయి. కొత్త విద్యాసంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ సమయాన్ని వృథా చేయకుండా ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు తమకు ఇష్టమైన పుస్తకాలను, పాఠ్యాంశాలను చదువుకోవచ్చు. దీనికోసం ఎన్సీఈఆర్టీ రూపొందించిన ఈ-పాఠశాల యాప్ (్ఖకఅూఎ) చాలా ఉపయోగపడుతుంది. ఉమాంగ్ యాప్లో దాదాపు కోటి ఈ-పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, విద్యాసంబంధమైన ఆడియోలు, వీడియోలు ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ స్కూల్ విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇది పనిచేస్తుంది. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా ప్రభుత్వం దీన్ని రూపొందించింది. ఒకటి నుంచి 12వ తరగతి (ప్లస్ టు) వరకు అన్ని పాఠ్యపుస్తకాలు, సప్లిమెంటరీ రీడింగ్ మెటీరియల్ ఈ యాప్లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ ఇతర అనేక భారతీయ భాషల్లో యాప్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దాదాపు 5 కోట్ల మందికిపైనే విద్యార్థులు ఇప్పటివరకు దీన్ని ఉపయోగించుకున్నారు. విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా పూర్తిగా స్టూడెంట్ ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించారు. వెబ్సైట్: web.umang.gov.in