నాణ్యమైన ధాన్యాన్నే తీసుకురావాలి
ABN , First Publish Date - 2021-05-10T05:57:11+05:30 IST
నాణ్యమైన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసు కురావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ రైతులకు సూచించా రు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
జగిత్యాల అర్బన్, మే 9: నాణ్యమైన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసు కురావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ రైతులకు సూచించా రు. ఆదివారం జగిత్యాల నియోజకవర్గ పర్యటనలో భాగంగా పట్టణంలోని శంఖులపల్లె వద్ద ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంకు వెళ్లి రైతుల తో ముచ్చటించారు. కొనుగోళ్ల విషయంపై రైతులను ఆరా తీశారు. కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. కొందరు రైతులు తమకు ఇబ్బందులు ఏమీ లేవని పేర్కొనగా, ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా పంట కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పం డిందన్నారు. రైతులు తప్ప, తాలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నాణ్యమైన ధాన్యం ద్వారానే తరు గు లేకుండా కొనుగోళ్లు జరిగి మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడకూడదని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం దన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ తోట మల్లిఖార్జున్, నరేష్, రాజు త దితరులున్నారు.