మర్కజ్ వెళ్లొచ్చిన వారికి ముస్లిం మత పెద్ద తాజా పిలుపు ఇదీ..

ABN , First Publish Date - 2020-04-05T19:06:18+05:30 IST

ఢిల్లీ మతపరమైన ప్రార్థమైన వెళ్లిన వారితో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయిన విషయం విదితమే. ..

మర్కజ్ వెళ్లొచ్చిన వారికి ముస్లిం మత పెద్ద తాజా పిలుపు ఇదీ..

గుంటూరు : ఢిల్లీ మతపరమైన ప్రార్థమైన వెళ్లిన వారితో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయిన విషయం విదితమే. మర్కజ్‌ వెళ్లిన ఇంకా చాలా మందికి కరోనా టెస్ట్‌లు చేసి ల్యాబ్‌కు పంపడం జరిగింది. ఈ క్రమంలో ముస్లిం మత పెద్ద ఉస్మాన్ సాహెబ్ తాజాగా మర్కజ్‌ వెళ్లొచ్చినవారికి కొన్ని సూచనలు చేశారు.


మసీదులకు రావొద్దు..

ఢిల్లీ మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు కరోనా చేయించుకోవాలి. కరోనా వైరస్ అనేది మనం సృష్టించిన వైరస్ కాదు.. ఇతర దేశాల నుంచి వచ్చిన వైరస్. ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిని అంటరాని వారిగా, దేశ ద్రోహులుగా చూస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. మేమూ భారతీయులమే.. ముస్లింలను అంటరాని వారిగా చూస్తున్నారు. ప్రభుత్వం సూచనలు మేరకు ఢిల్లీ మత సమావేశానికి వెళ్లొచ్చిన వారందరూ పరీక్షలకు సహకరిస్తున్నారు. త్వరలో జరగనున్న పెద్దల పండుగ, రంజాన్ వంటి పర్వదినాలకు కూడా మసీదులకు రాకుండా ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలిఅని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2020-04-05T19:06:18+05:30 IST