ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ ఫీజు గడువు పెంపు
ABN , First Publish Date - 2020-12-05T05:11:35+05:30 IST
డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో 2020-21 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లింగే గడువును ఈనెల 17వరకు పొడిగించినట్టు అధ్యయనకేంద్రం సమన్వయ కర్త కె రవికుమార్ తెలిపారు.
మఽధిర, డిసెంబరు 4: డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో 2020-21 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లింగే గడువును ఈనెల 17వరకు పొడిగించినట్టు అధ్యయనకేంద్రం సమన్వయ కర్త కె రవికుమార్ తెలిపారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుు కూడా తమ ఫీజును ఈనెల 17లోపు చెల్లించాలని సూచించారు. ఇంటర్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్, ఒకేషనల్, పాలిటెక్నిక్ పాసైన వారు డిగ్రీలో చేరేందుకు కళాశాలలో సంప్రదించాల్సిందిగా కోరారు.