నిజమైన వైసీపీ కార్యకర్తలతో త్వరలో బహిరంగ సభ: మరుకుర్తి

ABN , First Publish Date - 2021-09-19T05:29:58+05:30 IST

నిజమైన వైసీపీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌, సీఎం జగన్‌, జక్కంపూడి రామ్మోహనరావు అభిమానులతో త్వరలో రాజమహేంద్రవరంలో బహిరంగ సభ నిర్వహిస్తామని వైసీపీ నాయకుడు మరుకుర్తి కుమార్‌యాదవ్‌ అన్నారు.

నిజమైన వైసీపీ కార్యకర్తలతో త్వరలో బహిరంగ సభ: మరుకుర్తి

రాజమహేంద్రవరం సీటీ, సెప్టెంబరు 18: నిజమైన వైసీపీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌, సీఎం జగన్‌, జక్కంపూడి రామ్మోహనరావు అభిమానులతో త్వరలో రాజమహేంద్రవరంలో బహిరంగ సభ నిర్వహిస్తామని వైసీపీ నాయకుడు మరుకుర్తి కుమార్‌యాదవ్‌ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా పట్టుకుని కష్టనష్టాలకు ఓర్చి పార్టీని గెలుపించుకున్నామని, సీఎం జగన్‌ కుటుంబానికి, జక్కంపూడి కుటుంబానికి ఉన్న అనుబంధం, వారి భరోసాతో పార్టీలో ఉన్నా మని చెప్పారు. రూరల్‌, సిటీ, రాజానగరం నియోజకవర్గాల్లో జక్కంపూడి మార్క్‌ వుంటుందని దానిని చూసి ఓర్వలేక పార్టీ జెండాలు మోసిన కార్యక ర్తలను పక్కపెడతామంటే ఊరుకోబోమన్నారు. సమావేశంలో బర్ల సీతారత్నం, అనిల్‌కుమార్‌, సాలా సావిత్రి, జోసఫ్‌, ఉప్పాడ కోటిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T05:29:58+05:30 IST