ఎంపిక చేసిన శాఖలే తెరవండి

ABN , First Publish Date - 2020-03-24T10:01:14+05:30 IST

కరోనా వైర్‌సతో పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించినందు వల్ల ప్రభుత్వాధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో తప్పనిసరి లావాదేవీల నిర్వహణ కోసం...

ఎంపిక చేసిన శాఖలే తెరవండి

బ్యాంకులకు ఐబీఏ సూచన


న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించినందు వల్ల ప్రభుత్వాధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో తప్పనిసరి లావాదేవీల నిర్వహణ కోసం ఎంపిక చేసిన బ్రాంచీలను మాత్రమే తెరవాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) బ్యాంకులను కోరింది. రాష్ట్రస్థాయి ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్యాంకులు, లీడ్‌ జిల్లా మేనేజర్లు ప్రస్తుత పరిస్థితులకు దీటుగా వ్యాపార కొనసాగింపు ప్రణాళిక వ్యూహం రూపొందించాలని, దాని అమలుకు ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాలని తెలిపింది.


ఏ బ్యాంకులు తెరవవచ్చు లేదా మూసివేయవచ్చనే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రీజినల్‌, జోనల్‌, సర్కిల్‌ అధిపతులకు ఇవ్వాలని బ్యాంకు సీఈఓలకు సూచించింది. లావాదేవీలకు వీలైనంత వరకు ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ విధానా లే ఉపయోగించుకోవాలని బ్యాంకు కస్టమర్లందరికీ ఐబీఏ సూచించింది. కాగా ఎస్‌బీఐ శాఖలన్నీ 10 నుంచి 2 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ఆ బ్యాంకు తెలిపింది.

Updated Date - 2020-03-24T10:01:14+05:30 IST