సార్వత్రిక విద్యాపీఠం గోడపత్రికల విడుదల

ABN , First Publish Date - 2021-10-22T03:47:07+05:30 IST

ప్రతి ఒక్కరూ చదువుకుని సమాజంలో ఉన్నతస్థానాలకు ఎదగాలని సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కోఆర్డినేటర్‌ రమ ణారెడ్డి అన్నారు.

సార్వత్రిక విద్యాపీఠం గోడపత్రికల విడుదల

గూడూరు, అక్టోబరు 21: ప్రతి ఒక్కరూ చదువుకుని సమాజంలో ఉన్నతస్థానాలకు ఎదగాలని సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కోఆర్డినేటర్‌ రమ ణారెడ్డి అన్నారు. గురువారం స్థానిక లయోలా కళాశాల వద్ద దూరవిద్యా విధానంపై అవగాహన కల్పించే వాల్‌పోస్టర్లను విడుదల చేశారు.  కార్యక్రమంలో పంటా శ్రీనివాసులురెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

సైదాపురం: స్థానిక డా.సీ.ఆర్‌.ఆర్‌ జూనియర్‌ కళాశాలలో  గోడ పత్రికలు ఆవిష్కరించి కరపత్రాలను పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పసుపులేటి మురళీ, కొండాపు మోహన్‌రావు, అంకయ్య  పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T03:47:07+05:30 IST