పకడ్బందీగా ఆపరేషన్ ముస్కాన్ : ఎస్పీ
ABN , First Publish Date - 2020-07-16T10:52:04+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్ -19 పక డ్బందీగా అమలు చేస్తున్నా మని జిల్లా ఎస్పీ కె.నారా యణ నాయక్ చెప్పారు.
ఏలూరు క్రైం, జూలై 15 :జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్ -19 పక డ్బందీగా అమలు చేస్తున్నా మని జిల్లా ఎస్పీ కె.నారా యణ నాయక్ చెప్పారు. చైల్డ్ రైటర్స్ అడ్వొకసీ ఫౌం డేషన్ సంస్థ ఆపరేషన్ ముస్కాన్ సందర్భంగా వాల్పోస్టర్ను రూపొందించగా ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బాలలెవరూ కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
రెండవ రోజు 87 మంది గుర్తింపు.. ఆపరేషన్ ముస్కాన్లో జిల్లా వ్యాప్తం గా రెండో రోజు బుధవారం 77 మంది బాలికలు, 10 మంది బాలురను గుర్తిం చారు. వారి తల్లిదండ్రు లను పిలిపించి వారి తల్లి దండ్రులకు అప్పగించారు. ఆప రేషన్ ఈనెల 20 వరకూ కొనసాగించనున్నారు.