ఒప్పో నుంచి వచ్చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్

ABN , First Publish Date - 2021-01-17T03:15:04+05:30 IST

ఒప్పో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ పేరు ‘ఒప్పో ఎ93 5జీ’.

ఒప్పో నుంచి వచ్చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్

న్యూఢిల్లీ: ఒప్పో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ పేరు ‘ఒప్పో ఎ93 5జీ’.  ఇందులో సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ఎస్ఓసీని ఉపయోగించారు. ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫుల్‌ హెచ్‌డీ హోల్ పంచ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి. 


ఒప్పో ఎ93 5జీ 8జీబీ + 256 జీబీ స్టోరేజీ మోడల్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ. 22,500 వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో 128 జీబీ స్టోరేజీ ధరను మాత్రం వెల్లడించలేదు. 256 జీబీ ఆప్షన్ వేరియంట్‌ను ప్రీ ఆర్డర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి షిప్పింగ్ ప్రారంభం కానుంది.  సిల్వర్, బ్లాక్, అరోరా కలర్ ఆప్షన్లలో ఫోన్ అందుబాటులో ఉంది. 


ఒప్పో ఎ93 5జీ స్పెసిఫికేషన్లు:  ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.1, 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, ముందువైపు 8 ఎంపీ కెమెరా,  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వంటివి ఉన్నాయి.

Updated Date - 2021-01-17T03:15:04+05:30 IST