భారత్లో లాంచింగ్కు సిద్ధమైన ఒప్పో రెనో7 5జీ ఫోన్లు
ABN , First Publish Date - 2022-01-21T02:58:49+05:30 IST
చైనా మొబైల్ మేకర్ ఒప్పో సరికొత్త 5జీ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ ఒప్పో సరికొత్త 5జీ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఒప్పో రెనో 7 సిరీస్లో భాగంగా వనీలా ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 ప్రొ 5జీ, ఒప్పో రెనో 7ఎస్ఈ 5జీ ఫోన్లను తీసుకొచ్చిన మొబైల్ మేకర్.. గతేడాది వీటిని చైనాలో లాంచ్ చేసింది.
గత నెలలో ఒప్పో రెనో 7 సిరీస్ భారత ధరలు లీకయ్యాయి. ఇవి చైనీస్ వేరియంట్స్ స్పెసిఫికేషన్స్నే కలిగి ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. వీటిని భారత్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
వనీలా ఒప్పో రెనో 7 5జీ ధరల భారత్లో రూ. 28 వేల నుంచి రూ. 31 వేల మధ్యలో ఉండే అవకాశం ఉండగా, ఒప్పో రెనో 7 ప్రొ5జీ ధర రూ. రూ.41-43 వేల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. మిగతా వాటి ధరల వివరాలు వెల్లడి కాలేదు.
ఒప్పో రెనో 7 5జీలో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ చిప్సెట్ ఉపయోగించగా, ప్రొ మోడల్లో మీడియా టెక్ డైమెన్సిటీ 1200-మ్యాక్స్ ఎస్వోసీని ఉపయోగించారు. అలాగే, వీటిలో ప్రపంచంలోనే తొలిసారిగా సోనీ ఐఎంఎఖ్స్709 అల్ట్రా-సెన్సింగ్ సెన్సార్ (32 మెగాపిక్సల్), 1/1.56 అంగుళాల ‘ఫ్లాగ్షిప్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్’ (50 మెగాపిక్సల్)ను ఉపయోగించారు.