ప్రైవేటీకరణను వ్యతిరేకించండి
ABN , First Publish Date - 2021-04-16T05:34:48+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్దారుల ఐక్యవేదిక ప్రతినిధులు జె.మురళీ, కె.శేషగిరి పిలుపునిచ్చారు.
18న గురజాడ కళాభారతిలో బహిరంగ సభ
వాల్పోస్టర్లను ఆవిష్కరించిన వివిధ సంఘాల నేతలు
విజయనగరం దాసన్నపేట/ కలెక్టరేట్, ఏప్రిల్ 15: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్దారుల ఐక్యవేదిక ప్రతినిధులు జె.మురళీ, కె.శేషగిరి పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఆవరణలో పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గురజాడ కళాభారతిలో ఈ నెల 18న నిర్వహించనున్న బహిరంగ సభకు అన్ని వర్గాల వారు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధు లు లక్ష్మణరావు, పైడిరాజు, అప్పల సూరి, రవికుమార్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.