ఉనికి కోసం ప్రతిపక్షాల తాపత్రయం : మహేందర్రెడ్డి
ABN , First Publish Date - 2021-06-24T06:38:55+05:30 IST
ప్రతిపక్ష నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తుర్కపల్లి, జూన్ 23 : ప్రతిపక్ష నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పనిలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పేపర్లలో రావాలని ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. గుట్టను దర్శించుకొని తుర్కపల్లికి వచ్చి గ్రామసభలో ప్రొటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నా యకులు ధర్నా చేయడం నీతిమాలిన చర్య అన్నారు. ఈ ప్రాంతం బాగుపడాలనే ఆలోచన ఆ రెండు పార్టీలకు ఏ విధంగా లేదన్నారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు అందరికీ సమాచారం ఇచ్చారన్నారు. సమావేశంలో టీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, ఎంపీపీ భూక్య సుశీల, జడ్పీ వై్సచైర్మన్ బీకూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్ష, ఉపాధ్యక్షులు పోగుల ఆం జనేయులు, సత్యనారాయణ, ఎంపీటీసి గిద్దె కరుణాకర్, కోఆప్షన్ రహమద్ షరీష్, మార్కెట్ డైరెక్టర్ బద్దూనాయక్ పాల్గొన్నారు.