బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం!

ABN , First Publish Date - 2020-04-09T09:37:44+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఓ

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీని ప్రకారం.. రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల వద్ద ఉమ్మివేయకూడదు. తుమ్ము తుంపరలు, ఉమ్మి, తెమడ వల్ల కరోనా వ్యాపిస్తుండటం.. ఒక వ్యక్తి ద్వారా నెలలో ఈ వైరస్‌ 406 మందికి వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్‌ సర్వేలో తేలడంతో.. సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-04-09T09:37:44+05:30 IST