అభియోగాలపై సంజాయిషీ ఇవ్వండి

ABN , First Publish Date - 2020-09-27T09:49:56+05:30 IST

అభియోగాలపై సంజాయిషీ ఇవ్వండి

అభియోగాలపై సంజాయిషీ ఇవ్వండి

కుత్బుల్లాపూర్‌ మాజీ తహసీల్దార్‌కు ఉత్తర్వులు 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): తనపై వచ్చిన అభియోగాలపై డిప్యూటీ కలెక్టర్‌ ఎల్‌. కిషన్‌ సంజాయిషీ ఇవ్వాలని ప్రభుత్వం శనివారం ఉత్తర్వు లు జారీ చేసింది. కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఎల్‌. కిషన్‌ ప్రభుత్వ భూమిలో జీవో 58, 59 కింద ఖాళీ స్థలాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారన్న అభియోగాలపై 2015లో ఉమ్మడి రంగారెడ్డి కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఎల్‌.కిషన్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ చార్జీమెమో జారీచేశారు. అయితే, సదరు అభియోగాలపై పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్‌. కిషన్‌ ఇచ్చే సంజాయిషీని బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-27T09:49:56+05:30 IST