పెన్షనర్లకు నష్టం కలిగించేలా జీవోలు

ABN , First Publish Date - 2022-01-23T05:58:35+05:30 IST

నూతన పీఆర్సీ, ఇతర జీవోలు పెన్షనర్లకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పెడన మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రతినిధులు శనివారం తహసీల్దార్‌ పి.మధుసూదనరావుకు వినతిపత్రం అందజేశారు.

పెన్షనర్లకు నష్టం కలిగించేలా జీవోలు
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న పెన్షనర్లు

 విశ్రాంత ఉద్యోగుల సంఘం

పెడన, జనవరి 22: నూతన పీఆర్సీ, ఇతర జీవోలు పెన్షనర్లకు నష్టం కలిగించే  విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పెడన మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రతినిధులు శనివారం తహసీల్దార్‌ పి.మధుసూదనరావుకు వినతిపత్రం అందజేశారు. జీవోలను రద్దు చేయాలని, అశుతో్‌షమిశ్రా ఇచ్చిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి అన్ని బిల్లులను వెంటనే క్లియర్‌ చేయాలని కోరారు. కొత్త ఫణిభూషణరావు, మట్టా రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-23T05:58:35+05:30 IST