ఆన్లైన్ తరగతులపై ఓయూ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2022-01-16T20:52:20+05:30 IST
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటినుంచి ఈ నెల 30వరకు
హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటినుంచి ఈ నెల 30వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో పరీక్షలు రీషెడ్యూల్ విడుదల చేశారు. ఎల్లుండి నుంచి పలు యూనివర్సిటీలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు.