ఓటీఎస్ బాధ్యత అధికారులదే!
ABN , First Publish Date - 2022-01-29T03:03:13+05:30 IST
ఓటీఎస్కు సంబంధించిన అన్ని బాధ్యతలు అన్ని అధికారులవేనని ప్రత్యేక అధికారి సురేష్బాబు తెలిపారు.
కోట, జనవరి 28 : ఓటీఎస్కు సంబంధించిన అన్ని బాధ్యతలు అన్ని అధికారులవేనని ప్రత్యేక అధికారి సురేష్బాబు తెలిపారు. స్థానిక వైఎస్ఆర్ క్రాంతిపథం కార్యాలయంలో శుక్రవారం వీవోఏలు, సీసీలు, పలుశాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ఓటీఎస్ లక్ష్యాల సాధనలో పలువురు అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. కాగా, ఇదే కార్యాలయంలో నిర్వహించిన రైతు ఉత్పత్తి కార్యవర్గ సంఘ సమావేశఽంలో రైతు ఉత్పత్తిదారుల ఎఫ్బీవో ఏపీఎం సరస్వతి, వైఎస్ఆర్ క్రాంతిపథం ఏరియా కోఆర్డినేటర్ మధుసూదన్, ఏపీఎం రత్నయ్య సమీక్ష చేశారు. భవిష్యత్తులో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు కూడా రైతు ఉత్పత్తి సంఘాల ద్వారానే అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు మునిశంకరయ్య, ప్రసాద్, మాధవి, కిష్టమ్మ, జయమ్మ తదితరులు ఉన్నారు.